<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Telangana in News &#187; Fiction</title>
	<atom:link href="http://telanganaonline.org/news/category/counter/fiction/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://telanganaonline.org/news</link>
	<description>.. where facts are important &#38; not myths !</description>
	<lastBuildDate>Tue, 01 Feb 2011 19:15:20 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.1.2</generator>
		<item>
		<title>ఇదీ తెలుగు జాతి చరిత్ర</title>
		<link>http://telanganaonline.org/news/2009/12/16/ap_fictitious_history_lagadapati/</link>
		<comments>http://telanganaonline.org/news/2009/12/16/ap_fictitious_history_lagadapati/#comments</comments>
		<pubDate>Wed, 16 Dec 2009 19:40:17 +0000</pubDate>
		<dc:creator>Telangana Online</dc:creator>
				<category><![CDATA[Andhra Jyothy]]></category>
		<category><![CDATA[Counter]]></category>
		<category><![CDATA[Fiction]]></category>
		<category><![CDATA[Telugu]]></category>
		<category><![CDATA[Andhra]]></category>
		<category><![CDATA[fictitious]]></category>
		<category><![CDATA[history]]></category>
		<category><![CDATA[pradesh]]></category>

		<guid isPermaLink="false">http://telanganaonline.org/news/?p=83</guid>
		<description><![CDATA[- లగడపాటి రాజగోపాల్‌ విజ్ఞతతో రాగద్వేషాలకు అతీతంగా చరిత్ర అధ్యయనం చేస్తే కేవలం విదేశీయుల దుష్టపన్నాగాల, చరిత్రాత్మక తప్పిదాల వల్ల మాత్రమే తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక అశాస్త్రీయ, అజ్ఞాన, అనైక్యతకు గురైందని తెలుస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్‌- తెలుగు ప్రజ విభజించకూడని, విభజించలేని, విభజన కుదరని శతాబ్దాల చరిత్ర కలిగినది. తెలుగు మాట్లాడే ప్రజల సంక్షిప్త చరిత్రను ఇక్కడ ప్రస్తావించడం సందర్భ రహితం కాదు. మూడువేల సంవత్సరాల క్రితమే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రప్రదేశ్‌ జాతి ప్రస్తావన ఉంది.క్రీస్తు పూర్వం [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: right">- లగడపాటి రాజగోపాల్‌</p>
<p style="text-align: left">విజ్ఞతతో రాగద్వేషాలకు అతీతంగా చరిత్ర అధ్యయనం చేస్తే కేవలం విదేశీయుల దుష్టపన్నాగాల, చరిత్రాత్మక తప్పిదాల వల్ల మాత్రమే తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక అశాస్త్రీయ, అజ్ఞాన, అనైక్యతకు గురైందని తెలుస్తుంది. <span id="more-83"></span>కాని ఆంధ్రప్రదేశ్‌- తెలుగు ప్రజ విభజించకూడని, విభజించలేని, విభజన కుదరని శతాబ్దాల చరిత్ర కలిగినది.</p>
<p style="text-align: left">తెలుగు మాట్లాడే ప్రజల సంక్షిప్త చరిత్రను ఇక్కడ ప్రస్తావించడం సందర్భ రహితం కాదు. మూడువేల సంవత్సరాల క్రితమే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రప్రదేశ్‌ జాతి ప్రస్తావన ఉంది.క్రీస్తు పూర్వం మూడవ శతా బ్దం నుంచి వారి సామ్రాజ్యం ఈనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలన్నింటినీ కలుపుకొని భారతదేశంలోని అధికభాగానికి విస్తరించి ఉంది. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి ప్రారంభమైన ఆంధ్ర శాతవాహనుల పాలన నాలుగున్నర శతాబ్దాల పాటు సాగింది. ఇది మౌర్యరాజుల కాలంతో పోల్చితే అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందిన పరిపాలన అని కౌటిల్యుడు తన రచనలలో వివరించాడు. ఆ తరువాత వచ్చిన ఇక్ష్వాకులు కృష్ణా, గోదావరి పరివాహక లోయ ప్రాంతాలను విజయపురి రాజధానిగా- ఇప్పటి నాగార్జునసాగర్‌ ప్రాంతాన్ని పరిపాలించారు.</p>
<p style="text-align: left">అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఇక్కడ ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత చాళుక్యులు పాలించారు. వారి తరువాత కాకతీయులు 12వ శతాబ్దంలో ఆంధ్ర నగరిగా ప్రసిద్ధి చెందిన వరంగల్‌ రాజధానిగా తమ సామ్రాజ్యాన్ని నెల్లూరు, కడప వరకు విస్తరించి రెండు శతాబ్దాలు పరిపాలించారు. స్వర్ణయుగంతో పోల్చదగిన కాకతీయుల పాలనలో చిత్రకళ, స్థూపవిద్య, భవన నిర్మా ణ వైభవం వెల్లివిరిసింది. రామప్ప సరస్సు, లబానవరం సరస్సు వంటి నిర్మాణాలు చేపట్టారు. సాగునీటి సౌకర్యా ల వల్ల పటిష్టమైన ఆర్థిక విధానానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీ సుల్తానుల వల్ల కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. బహుమనీ, విజయనగర సామ్రాజ్యాల పతనంతో గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహీ సుల్తానులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.</p>
<p style="text-align: left">సుల్తానులు తమ పాలన లో శ్రీకాకుళం నుంచి గోల్కొండ వరకు తెలుగు మాట్లా డే ప్రాంతాలను అన్నింటినీ ఏకం చేశారు. అసఫ్‌జాహీ అధికారంలో కూడా తెలుగు ప్రాంతాలు అన్నీ ఒకే పరిపాలన కింద ఉన్నాయి. విదేశీ శక్తుల ఆధిపత్యం నెలకొన్న తరువాత మాత్రమే తెలుగు మాట్లాడే ప్రజల ఐక్యత విచ్ఛిన్నానికి బీజాలు పడ్డాయి. 17వ శతాబ్ద ప్రారంభంలో ఉత్తర సర్కారు శ్రీకాకుళం నుంచి దిగువన కృష్ణానది ప్రాంతాన్ని ఫ్రెంచ్‌ సైన్యాల నిర్వహణ ఖర్చుల భారానికి పరిహారంగా సాలార్‌ జంగ్‌ ఫ్రెంచివారికి ధారాదత్తం చేశారు.</p>
<p style="text-align: left">మూడవ కర్ణాటక యుద్ధం అనంతరం అధికారం, వాణిజ్యం బలాబలాలు ఆంగ్లేయుల కు అనుకూలంగా మారాయి. దీంతో ఉత్తర సర్కారును 1761లో ఫ్రెంచి ఆధిపత్యం నుంచి ఆంగ్లేయుల ఆధిపత్యానికి మార్చుకుంటూ రాబర్ట్‌ క్లైవ్‌ కలిపేసుకున్నాడు. 1799లో టిప్పుసుల్తాన్‌ పతనం ఫలితంగా బళ్ళారి, కర్నూలు, అనంతపురం, కడప (చిత్తూరుతో కలిపి) హైదరాబాద్‌ నిజాం రాజ్యంలో భాగమయ్యాయి. సీడెడ్‌ ప్రాంతాన్ని 1800 సంవత్సరంలో ఫోర్టు సెంట్‌ జార్జి బ్రిటీష్‌ ప్రభుత్వానికి అప్పగించారు.</p>
<p style="text-align: left">ఆనాటికి కర్ణాటకలో భాగంగా గల నెల్లూరు 1901లో ప్రిన్స్‌ ఆరెంటు మనోవర్తి భాగంగా మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది. అలా చరిత్రాత్మక ప్రమాదాల ద్వారా మాత్రమే విదేశీపాలనలోనే తెలుగు ప్రజలు అశాస్త్రీయ విభజనకు గురయ్యారనేది తిరుగులేని సత్యం. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర మూడు వేల సంవత్సరాల నాటిది. ఆంధ్రప్రదేశ్‌ పేరుతో సహా చరిత్ర మూడు వేల సంవత్సరాల నాటిది. ఆ చరిత్ర తెలియని కుహనావాదులు, అజ్ఞానులు, అమాయకులు. &#8216;ఆంధ్రప్రదేశ్‌&#8217; నిన్న, మొన్నటిదనుకొని జాతి వ్యతిరేక చర్యలకు ఉపక్రమించడం చరిత్రను కించపరచడమే.</p>
<h2 style="text-align: left">ఆంధ్ర ప్రదేశ్‌ చరిత్ర మూడు వేల ఏళ్ల నాటిది</h2>
<p style="text-align: left">మూడు వేల సంవత్సరాల క్రితం రచించిన &#8216; ఐతరేయ బ్రాహ్మణం&#8217;లో ఆంధ్రప్రదేశ్‌ జాతి ఉనికి ప్రస్తావించారు. క్రీస్తుకు ముందు మూడవ శతాబ్దానికే సామ్రాజ్యం ఈనాటి ఆంధ్రప్రదేశ్‌ భాగాలను అన్నీ కలుపుకొని భారతదేశంలో అధిక భాగపాలన జరిగింది. నాలుగున్నర దశాబ్దాల కాలం మౌర్యరాజుల స్థాయిలో సరితూగే అత్యున్నత అభివృద్ధి పాలనను ఆంధ్ర శాతవాహనులు అందించారు. ఇది కౌటిల్యుని రచనలలో స్పష్టం గా గమనించవచ్చు. తరువాత ఇక్ష్వాకుల వంశీయుల పాలన విజయపురి రాజధానిగా చారిత్రాత్మకంగా జరిగింది.</p>
<p style="text-align: left">బౌద్ధ మహాయానం మూడు పువ్వులు- ఆరు కాయలుగా విరజిల్లిన కాలం ఇదే. 12వ శతాబ్దంలో కాకతీయుల పాలన వరంగల్లు రాజధానిగా నెల్లూరు, కడప వరకు సాగింది. ఈ సామ్రాజ్య పతనం అనంతరం గోల్కొండ సుల్తాన్లు శ్రీకాకుళం నుంచి గోల్కొండ వరకు తెలుగు మాట్లాడే ప్రజల ప్రాంతాలన్నింటినీ సమర్థంగా పరిపాలించారు. అసఫ్‌ జాహీ అధికారంలో కూడా తెలుగు ప్రజ ఐక్యంగా ఉన్నా రు. టిప్పు సుల్తాన్‌ పతనానంతరం కూడా బళ్ళారి, కర్నూలు, అనంతపూర్‌, కడప (చిత్తూరు) కలిపి హైదరాబాద్‌ నిజాంకు కలిసింది.</p>
<p style="text-align: left">ఇంకా విజ్ఞతతో రాగద్వేషాలకు అతీతంగా చరిత్ర అధ్యయనం చేస్తే కేవలం విదేశీయుల దుష్టపన్నాగాల, చారిత్రాత్మక తప్పిదాల వల్ల మాత్రమే తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక అశాస్త్రీయ, అజ్ఞాన, అనైక్యతకు గురైందని తెలుస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్‌- తెలుగు ప్రజ విభజించకూడని, విభజించలేని విభజన కుదరని శతాబ్దాల చరిత్ర కలిగినది. ఈ నేపథ్యంలో మానవమాత్రులందరూ ఆంధ్రప్రదేశ్‌ సంరక్షణ, పరిరక్షణకు సర్వశక్తులు వొడ్డి కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక సమయమిది. ఇక్కడ ఇప్పుడు ఏమాత్రం ఏమరుపాటులో తప్పటడుగు వేసినా భావితరాల ముందు నేటి రాజకీయ పాలనా ప్రతినిధులుగా, శాశ్వత ద్రోహులుగా శిక్ష అనుభవించక తప్పదు</p>
<ul>
<li>
<div style="text-align: left"><a rel="bookmark" href="http://telanganaonline.org/news/2009/12/22/pradesh_not_telugu_name/">‘ప్రదేశ్‌’ తెలుగు పేరే కాదు</a> - వరవరరావు </div>
</li>
</ul>
<iframe src="http://www.facebook.com/plugins/like.php?href=http%3A%2F%2Ftelanganaonline.org%2Fnews%2F2009%2F12%2F16%2Fap_fictitious_history_lagadapati%2F&amp;layout=standard&amp;show_faces=true&amp;width=450&amp;action=like&amp;colorscheme=light&amp;height=80" scrolling="no" frameborder="0" style="border:none; overflow:hidden; width:450px; height:80px;" allowTransparency="true"></iframe>]]></content:encoded>
			<wfw:commentRss>http://telanganaonline.org/news/2009/12/16/ap_fictitious_history_lagadapati/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
	</channel>
</rss>

